తెలంగాణలో పశు సంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి(ఎఫ్ఏసీ)గా సబ్యసాచి ఘోష్ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి అధర్సిన్హా పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఘోష్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.