రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్(M) బ్రాహ్మణపల్లికి చెందిన జంగయ్య, మన్సూరాబాద్కు చెందిన శేఖర్రెడ్డి, ఎండీ మైమూద్ ముగ్గురూ కలిసి పథకం వేసి తుర్కయాంజల్ శ్రీరామ్నగర్లో నివాసముండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనాన్ని కాజేయాలనుకున్నారు. నల్లధనం ప్లేసులో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి తిరుమనతురై ఇంట్లోకి ప్రవేశించి, ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేశారు. తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశిలించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.