ఉప్పలగుప్తం: ట్రాక్టర్ కు నిప్పు.. పోలీసుల దర్యాప్తు

69చూసినవారు
ఉప్పలగుప్తం: ట్రాక్టర్ కు నిప్పు.. పోలీసుల దర్యాప్తు
ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవిల్లికి చెందిన రైతు మోరంపూడి మాచర్య ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పొలం వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ కు నిప్పు పెట్టి దహనం చేసినట్లు శనివారం మాచరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనలో పాక్షికంగా నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్