జ్యోతుల నెహ్రూను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి
సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం నేటితోతెరపడడంతో గండేపల్లిమండలం గండేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు ఆధ్వర్యంలో చైతన్య రథంపై ప్రతి వీధి తిరుగుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి మలుపు అని 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నెహ్రూను గెలిపించాలన్నారు.