కాకినాడ లోజబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం
తాము ప్రొఫెషనల్ కమెడియన్స్ అని, వైసీపీ నేతలు పొలిటికల్ కమెడియన్స్ అని జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పేర్కొన్నారు. కాకినాడ లో 5 వి డివిజన్ లో శుక్రవారం సాయంత్రం జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన టీడీపీ , బిజెపి కూటమి మద్దతుగా కాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలనుకోరారు.