కైకలూరు: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

72చూసినవారు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని జడ్పీటిసి సభ్యురాలు ముంగర విజయ నిర్మల అన్నారు. సోమవారం కైకలూరు రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో మండవల్లి మండలంలోని ఇంగిలిపాక లంక గ్రామంలో నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాలలో ఆమె పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వన్యప్రాణులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అటవీశాఖ ఎస్ ఎఫ్ ఓ సుజాత, డి అర్ ఓ రమేష్, ఎఫ్ బిఓ రాజేష్, వెంకన్న, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్