రైల్వే కోడూరు - Railway Koduru

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
Aug 30, 2024, 14:08 IST/మహబూబాబాద్
మహబూబాబాద్

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

Aug 30, 2024, 14:08 IST
పంటల దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీరుతాయో లేదోనని మనోవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్‌ మండలం నడివాడ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నడివాడ గ్రామానికి చెందిన పెద్దల పాపయ్య (54) తనకున్న మూడెకరాలతో పాటు మరో రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు. గత ఏడాది రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా దిగుబడి రాక పెట్టుబడి కూడా రాలేదు. ఈసారైన తెచ్చిన రూ.7లక్షల అప్పు తీరాలని మూడు ఎకరాల్లో మిర్చి వేసి మరో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మిరప పంట ఎండిపోతుండటంతో మనోవేదన చెందిన పాపయ్య తన వ్యవసాయ బావి వద్దనే పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య సారమ్మ, కుమారులు సంపత్, సందీప్‌ ఉన్నారు.