ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. డిఆర్సీ సమావేశం శనివారం ముగిసింది. రాజీనామా అంశంపై కొలికపూడి శ్రీనివాస్ దాటవేత ధోరణి వ్యక్తం చేశారు. డిఆర్సీ సమావేశం అనంతరం మీడియా ప్రశ్నలను దాటవేసిన ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి 48 గంటల డెడ్లైన్ దాటిందని అడిగిన ప్రశ్నలకు సమాధానం తర్వాత చెబుతానంటూ కొలికపూడి వెళ్లిపోయారు.