
జయతి గ్రామంలో పంచాంగ శ్రవణం
మెంటాడ మండలం జయితి గ్రామంలోని రామ మందిరంలో కొత్త అమావాస్య పురస్కరించుకొని శనివారం పంచాంగ శ్రవణ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పురోహితులు వేదుల భువనేశ్వర్ ప్రసాద్ శర్మ గ్రామ ప్రజలకు పంచాంగం చదివి వినిపించారు. విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా వివిధ రాశులు గల వారికి కలిగే లాభనష్టాలను వివరించారు. విశ్వావసు నామ సంవత్సరం లో పంటలు సమృద్ధిగా పండుతాయి అని తెలిపారు.