
నందిగాం: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల వినతి
నందిగాం మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు తమకు పనిభారం తగ్గించాలని, ఒత్తిడి లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నందిగాం ఎంపీడీవో రాజారావుకు వినతిపత్రం అందజేశారు. వివిధ సర్వేలతో సతమతమవుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు.