

విశాఖ: ఇంటర్ నేషనల్ అవార్డు అందుకున్న తల్లి, కుమార్తె
ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో అంతర్జాతీయ అవార్డుల మహోత్సవం జరిగింది. రోలుగుంటకు చెందిన ఉపాధ్యాయురాలు పీ. వీ. ఎం. నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకొని విశేష గౌరవాన్ని పొందారు. నాగజ్యోతికి ఇంటర్నేషనల్ బెస్ట్ ఎచీవర్ అవార్డు” కూడా లభించింది. ఆమె కుమార్తెకు భారత్ సమాన్ అవార్డు కూడా లభించింది.