పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈటల రోడ్ షో
మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ షో లో పాల్గొన్నారు. పీర్జాదిగూడ ప్రజలు రోడ్డు పొడవున ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు ఘట్కేసర్ ఎం పీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు జైపాల్ రెడ్డి, శిల్పా రెడ్డి, అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.