ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ఈ నెల 22వ తేదీ ప్రారంభమైన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. స్థానాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణ చార్యులు, ప్రధాన అర్చకులు వెంకట ప్రసాదచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా హోమం, అభిషేకం నిర్వహించి స్వామి వారి పుష్కరిణిలో చక్ర స్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు.