పథకాలే  గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు

పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్లలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నీలం మధు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. అలాగే అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ముందుకెళ్లి వారిని చైతన్య పర్చాలన్నారు. ఎన్నికలలో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నీలం మధు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేదల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుని ముందుకు వెళ్తుందన్నారు.

వీడియోలు


తెలంగాణ
ఐఐటీలో చదివినా ఉద్యోగాలు కరువేనా...?
Apr 29, 2024, 08:04 IST/

ఐఐటీలో చదివినా ఉద్యోగాలు కరువేనా...?

Apr 29, 2024, 08:04 IST
ఐఐటీలో చదివి మంచి ఉద్యోగం సాధించాలనేది ప్రతి విద్యార్థి కల. టెన్త్ పాసైన విద్యార్థులకు కానీ, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు కానీ ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచేది ఐఐటీ. అలాంటి ఐఐటీలో చదివిన విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రాకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఐఐటీ చేస్తే అప్పట్లో రూ.10 లక్షల ప్యాకేజీకి తక్కువ ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఐఐటీకి ఆదరణ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో కేవలం 3, 4 లక్షల ప్యాకేజీలకే ఉద్యోగం చేస్తున్న వారూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే Qs ర్యాంకింగ్‌లో బాంబే ఐఐటీ 149 ర్యాంక్‌లో ఉంది. అయితే బాంబే ఐఐటీలో ప్లేస్ మెంట్స్ రాని వారు 36 %, ఐఐటీ మద్రాస్‌లో 32.6%, కాన్పూర్ ఐఐటీలో 35% మందికి ప్లేస్ మెంట్స్ రావడం లేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెటావర్స్ లాంటి కోర్సులకు మనకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కావున ఐఐటీ జాబ్స్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ తగ్గడం కూడా కారణాలే.