కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం రెడ్డి చెరువుపల్లి లో శుక్రవారం పెనుకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహప్ప ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.