మూల్యాంకన కేంద్రాలను తనిఖీ చేసిన వైవియు వీసీ
యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని వీసి సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన డిగ్రీ సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రానికి వైవియు సీఈ ఈశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం విసి వచ్చారు. మూల్యాంకన విధులకు వచ్చిన అధ్యాపకుల సౌకర్యాలపై ఆరా తీశారు. వీసీ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి మూల్యాంకనం పూర్తి చేయాలన్నారు.