శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహనిర్బంధాలు
జూన్ 1 నుండి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్. పి సిద్ధార్థ కౌశల్ తెలిపారు. మంగళవారం కమలాపురంలో ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహనిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్. పి పేర్కొన్నారు.