నెల్లూరు సిటీ - Nellore City

అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి- వి.పి.ఆర్

అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి- వి.పి.ఆర్

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం విజమూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సమక్షంలో కలిగిరి నాయకులు మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, ఆయన అనుచరులు దాదాపు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, సతీమణి శాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.

వీడియోలు


వికారాబాద్ జిల్లా