విసన్నపేటలో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం సత్తన్న గూడెం గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొండబోయిన కృష్ణ(41) ఇంట్లో విద్యుత్తుకు సంబంధించి మరమ్మత్తులు చేస్తుండగా సీలింగ్ ఫ్యాన్ కు ఉన్న రాడ్డు కు విద్యుత్ సప్లై వచ్చింది. ఆ రాడ్డు ప్రమాదవశాత్తు తగలడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.