
తిరువూరు: రఘునందన్ కవితకు బహుమతి
పాల్వంచ కళా పరిషత్ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో తిరువూరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రేపాక రఘునందన్ రచించిన మనిషి మరణించాడోచ్ అనే కవితకు ప్రోత్సాహక బహుమతి లభించింది. మంగళవారం పాల్వంచలో జరిగే ఉగాది ఉత్సవాల ముగింపు సభలో నగదు బహుమతితో పాటు సత్కారం ఉంటుందన్నారు. కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు ఆహ్వానం పంపినట్లు రఘునందన్ సోమవారం తెలిపారు.