
కనిగిరి: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు వరమని బీజేపీ కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య అన్నారు. పామూరు పట్టణంలో విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ పొందిన పాతకోట రవణమ్మ, సిద్ధవటం వెంకటేశ్వర్లు, నన్నూరి జ్యోతిలకు టూల్ కిట్స్ లను వెంకటరమణయ్య గురువారం పంపిణీ చేశారు. విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ పొందిన వివిధ వృత్తుల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.