నర్సీపట్నం - Narsipatnam

విశాఖ జిల్లాలో కలకలం రేపిన ఘటన...

విశాఖ జిల్లాలో కలకలం రేపిన ఘటన...

మాకవరపాలెం మండలం తాడపాల గ్రామానికి చెందిన గనిశెట్టి జోగినా యుడు, గనిశెట్టి చిన్న, గనిశెట్టి భాస్కరరావు అన్నదమ్ములకు గని శెట్టి దొరబాబుతో గత కొన్ని నెలలుగా భూ తగాదాతో పాటు ఇంటి స్థలం వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి. దొరబాబు తన ఆటో ని ఇంటి ముందు ఉన్న స్థలంలో రోజూ ఉంచగా వారు ఆ స్థలంలో రెండు రోజులుగా పశువులను కడుతున్నారు. సోమవారం రాత్రి దొరబాబు తన ఆటోను రోజు లాగే అక్కడే పెట్టి వెళ్లగా ఆటోను అక్కడ నుంచి తీసేయాలని ముగ్గురు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో దొరబాబు కుమార్తె తలకు గాయమవగా కోపోద్రిక్తుడై కత్తితో ఆ ముగ్గురి పై దాడికి దిగాడు. అన్నదమ్ముళ్లలో ఒకరైన గనిశెట్టి జోగినాయుడు ను కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


కొమరంభీం జిల్లా