పోతురాజు విన్యాసాలు
వికారాబాద్ జిల్లా పుడూరు మండల పరిధిలోని రేగడి మామిడిపల్లి గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ బోనాల ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా పోతురాజు విన్యాసాలు పలువురిని ఆకర్షించాయి. భక్తులు అత్యంత భక్తి భావంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.