మేలో భారీగానే ఉష్ణోగ్రతలు: ఐఎండీ
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. మే నెలలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య, వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్నీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయంది. తుపానులు సగటు కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు ఇటీవల ప్రతిరోజు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.