రేపు పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు విభిన్న వాతవరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 12, మన్యంలో 10, అల్లూరి జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.