కాకినాడ రూరల్లో హవా ఎవరిది?
కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రజారాజ్యం పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి కురసాల కన్నబాబు, కూటమి నుండి జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), కాంగ్రెస్ నుండి పిల్లి సత్య లక్ష్మి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో స్వతంత్ర అభ్యర్థులు పెథాని సత్యనారాయణ, కారి గోపాలకృష్ణ బరిలో ఉన్నారు కాకినాడ రూరల్ గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనుంది.