కడియం ఎన్నికల ప్రచారంలో మంత్రి వేణు
అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన మహోన్నత వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కడియంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు.