నాటు సారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
కడియం మండలం కడియపులంకలో నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కడియం సిఐ బి. తులసిధర్ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎన్. దుర్గప్రసాద్ వారి సిబ్బందితో సోమవారం సాయంత్రం కడియపులంకలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నాటు సారా అమ్ముతున్న ఎం. ఆంజనేయులును అరెస్ట్ చేసి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు.