జిల్లాలో పోలింగ్ ప్రక్రియ విజయవంతం
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, మూడంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు, సంబంధిత సామగ్రిని స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరచినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను ఉంచినట్లు తెలిపారు.