
నగిరి: టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో గురువారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.