
నగిరి: ఈడిగ కులస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాల్టీ పరిధిలో ఈడిగ కులస్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వీరికి ఓ మద్యం షాపు కేటాయించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అధికారి బుధవారం మాట్లాడుతూ మద్యం షాపునకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.