పాండ్రంగిలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ
భీమునిపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పద్మనాభం మండలం పాండ్రంగి ఎం. పి. టి. సి. పిన్నింటి రమణ- భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో శనివారం పసుపు కండువా కప్పుకున్నారు. రమణ తో పాటు పంచాయతీ వార్డు సభ్యుడు బి. సూరిబాబు, సీనియర్ వైసీపీ నాయకుడు కె. కృష్ణ సహా 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు.