పోలింగ్ సరళిపై కెకెరాజు సమీక్ష
సార్వత్రిక ఎన్నికల్లో ఎండను సైతం లెక్కచేయకుండా ఓటును వినియోగించుకొని వైసిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన పార్టీ నేతలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీశ్రేణులతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. వార్డులు వారీగా పొలైన ఓట్ల వివరాలు, వారిలో మన పార్టీకి ఉన్న ఆదరణపై పార్టీశ్రేణులతో చర్చించారు.