వ్యాయామ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. గంగాధర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ జె. రాజ్ కుమార్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా బాల్కొండ ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు ఘనంగా వారిని ముప్కల్ క్రీడ ప్రాంగణంలో సన్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేష్, శ్రీకాంత్, మధు, స్రవంతి, సౌజన్య, కవిత, భార్గవి, సాయిలు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.