ప్రేమ విఫలం.. యువతి మృతి?
వీర్నపల్లి మండలం బాబాయ్ నాయక్ తండాలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. మమత(21) అనే యువతి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. ఓ తండాకు చెందిన సతీష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు అతని ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రెండు తండాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.