ఆలేరు నియోజకవర్గం
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
యాదాద్రి భువనగిరి, గుండాల మండల కేంద్రంలోని హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో భజనలతో, జై హనుమాన్, జైశ్రీరామ్ నినాదాలతో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శేఖర్, మధు, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.