భువనగిరి నియోజకవర్గం
అరూరులో పోలీసులు ఫ్లాగ్ మార్చ్
వలిగొండ మండలం అరూరు గ్రామంలో శుక్రవారం ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసులు ఆ గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.