అనంతపురం రూరల్ వైసీపీ ఎంపీటీసీ నగేశ్పై హత్యాయత్నం
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ ఎంపీటీసీ నగేశ్పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.