మదనపల్లె ఆస్పత్రిలో పాము కలకలం
మదనపల్లె జిల్లా ఆస్పత్రి చిన్న పిల్లల వార్డులో శుక్రవారం పాము కలకలం రేపింది. పిల్లల వార్డులో పాము ఉన్నట్లు అక్కడి వారు గుర్తించి ఉరుకులు, పరుగులు తీశారు. పాము ఆస్పత్రిలోని వార్డులోకి రావడంతో రోగులు భయ భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ఆస్పత్రిలో మట్టి దిబ్బలు పేరుకు పోవడంతోనే పాములు ఆస్పత్రిని ఆవాసంగా మార్చుకున్నాయని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.