దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటులు
పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు దత్తాత్రేయ స్వామివారిని జబర్దస్త్ నటులు గెటప్ శీను, సుడిగాలి సుదీర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను గెలుపించేందుకు తమ వంతు ఉడతాభక్తిగా సహాయం అందించేందుకు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రావడం జరిగిందన్నారు.