చల్లపల్లిలో జోరుగా ఎన్నికల ప్రచారం
టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ల విజయం కోరుతూ చల్లపల్లిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. బుద్ధప్రసాద్ అల్లుడు, ప్రవాస భారతీయులు కనపర్తి అవనీంద్ర ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి గాజు గ్లాసు గుర్తుపైనే రెండు ఓట్లు వేసి బాలసౌరి, బుద్ధప్రసాద్ లను గెలింపించాలనీ, అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.