చల్లపల్లిలో 10 ఎకరాల వరిగడ్డి వామి దగ్ధం
చల్లపల్లి దళితవాడలో వరిగడ్డి వామి దగ్ధమైంది. కొడాలి సురేష్ బాబుకు చెందిన 10ఎకరాల గడ్డి వామి ఆదివారం దగ్ధమైంది. అవనిగడ్డ అగ్నిమాపక అధికారులు సిబ్బందితో కలిసి వచ్చి మంటలను అదుపుచేశారు. మంటలు వరిగడ్డి వామికి నలువైపులా అంటుకోవటంతో మధ్యాహ్నం వరకూ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. లక్ష రూపాయలకు పైగానే ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.