కొండపల్లిలో వైసీపీ అభ్యర్థి రోడ్ షో
మైలవరం ఎమ్మెల్యేగా తాను గెలుస్తానని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు అన్నారు. గురువారం మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలే తన విజయానికి నాంది పలుకుతాయని ఆయన అన్నారు. జగనన్నకు ఓటు వేసేందుకు తామంతా సిద్ధమని కొండపల్లి గ్రామస్తులు అన్నారు.