లక్ష్మీ నరసింహ విగ్రహం చోరి
బొబ్బిలి పట్టణం ఫుల్ బాగ్ కాలనీ సమీపంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహాలు, కలశం శుక్రవారం చోరీకి గురైనట్లు గీతామండపం (డోలమండపం) కమిటీ సభ్యులు పెంట స్వామినాయుడు, బి. కృష్ణారావు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. వెంటనే ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని అన్నారు. కొందరు వ్యక్తులు ఆలయాన్ని నేలమట్టం చేశారని పేర్కొన్నారు.