May 10, 2024, 17:05 IST/ఖానాపూర్
ఖానాపూర్
ఆత్రం సక్కును గెలిపించుకుందాం
May 10, 2024, 17:05 IST
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించుకుందామని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం జన్నారం పట్టణంలోని పలు కాలనీలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ బి. శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కే. శ్రీధర్ రావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.