చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కడప జిల్లా పోరుమామిళ్లలోని మైదుకూరు రోడ్డులో ఉన్న హెచ్.పి పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని ఈదుళ్ళ పళ్లి గ్రామానికి చెందిన రమేష్ గా గుర్తించారు. మృతుడు పెట్రోలు బంకులో పంపు ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.