మాదక ద్రవ్యాల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన డిఎస్పి
కడప జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 15 రోజులు పాటు జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాల "వాల్ పోస్టర్" మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ తమ కార్యాలయం నందు బుధవారం ఆవిష్కరించడం జరిగింది. డిఎస్పీ మాట్లాడుతూ ఎక్కువగా యువత సరదాల కోసం మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.