బడా భీంగల్ గ్రామంలో ధ్యానం పై అవగాహన
భీంగల్ మండలం, బడా భీంగల్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రాజు హంస ఆధ్వర్యంలో సోమవారం ధ్యాన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ విక్రమ్ హాజరై మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు గ్రామంలో ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందాలని సూచించారు. ధ్యానం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వారన్నారు. ధ్యానం చేసి శాఖాహారం తీసుకోవాలని కోరారు.