భారీగా బంగారం, వెండి ఆభరణాలు పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కేజీల బంగారం 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.