అధికార ప్రతిపక్ష పార్టీలపై ఓ స్థాయిలో ఫైర్: చిందనూరు నాగరాజు
రాయదుర్గం పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు మీడియాతో మాట్లాడారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు. జగనన్న లే అవుట్ లలో కోట్లలో అవినీతి జరిగిందని సాక్షాధారాలతో బయటపెట్టారు. రాయదుర్గం అభివృద్ధిని రెండు పార్టీలు విస్మరించాయన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఎస్పీ పార్టీని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు.